ప్రస్తుతం రవితేజ సైంటిఫిక్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ తమిళ రీమేక్ తెరకెక్కనుంది. ‘రణరంగం’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు దర్శకుడు సుధీర్వర్మ. ఇక తమిళ రీమేక్ విషయానికొస్తే… మాధవన్, విజయ్సేతుపతి కథానాయకులుగా పుష్కర్-గాయత్రి ద్వయం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం “విక్రమ్వేదా” (2017) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పోలీసాఫీసర్, గ్యాంగ్స్టర్ మధ్య నడిచే పవర్ఫుల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. సుధీర్వర్మ దర్శకత్వం వహిస్తారు. తమిళ మాతృకను నిర్మించిన యస్.శశికాంత్..వై నాట్ స్టూడియోస్ పతాకంపై తెలుగు రీమేక్ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్కు తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసే పనిలో దర్శకుడు సుధీర్వర్మ ఉన్నారని సమాచారం. మాధవన్ పోషించిన పోలీసాఫీసర్ పాత్రను రవితేజ చేస్తారని చెబుతున్నారు. గ్యాంగ్స్టర్ పాత్ర కోసం యువ కథానాయకుడి వేటలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రంతో సుధీర్ వర్మ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
previous post
సౌత్లో హీరోలను చూడటానికే థియేటర్స్కు వస్తారు : రకుల్ ప్రీత్ సింగ్