యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాహోకి చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా భారీగానే జరిగిందని తెలుస్తుంది. పాత రికార్డులని తిరగరాసేందుకు సాహో టీం సిద్ధం కాగా, తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనత సాధించింది. ప్రభాస్ గాగుల్స్ పెట్టుకొని ఉన్న లుక్ని ట్విట్టర్ ఇమోజీగా విడుదల చేసింది సాహో చిత్ర బృందం. ఇంత వరకు ఏ తెలుగు సినిమాకి సంబంధించి ఇమోజీ విడుదల కాకపోగా, ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం సాహో కావడం విశేషం. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
#Saaho is the FIRST #Telugu film got Twitter emoji#Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations‘s Magnum opus all set to release on 30th August pic.twitter.com/9JU4jKQvAi
— BARaju (@baraju_SuperHit) August 23, 2019