telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహిళా కార్యకర్తపై.. బీజేపీ నేత అత్యాచారం… ఊడపీకి…

ఒకపక్క మతాన్ని ప్రేమిస్తున్నాం, గోవు పూజనీయం అని చెప్తున్నా అందులో చిత్త శుద్ధి లేదని వాళ్ళు చేసే పనులతో అర్ధం అవుతుంది. ప్రస్తుతం బీజేపీ నేతలు చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి. ఆ పార్టీనేత ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. ఓ మహిళా కార్యకర్తపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇప్పటికే బీజేపీ బూజుపట్టి పోతుంటే, ఇలాంటి ఘటనలు దానికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయంటూ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. వివరాలలోకి వెళితే, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన ఓ రాజకీయ నేత సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్తపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో చోటుచేసుకుంది. దీంతో అతనిపై ఆగ్రహించిన పార్టీ యాజమాన్యం బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇక్కడి బల్బీర్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే తనపై లైంగికదాడి చేశాడని వాపోయింది. ఈ ఘటన మీడియాలో రావడంతో సంజయ్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆందోళనకు దిగింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులు ఎప్పటికి తేలతాయో, ఎప్పటికి శిక్షలు ఖరారు అవుతాయో.. అప్పటిదాకా ఆ నేత బాహాటంగానే అధికారం చెలాయిస్తూనే ఉంటాడు.. ఇది మన చట్టం దౌర్బాగ్యం. దర్యాప్తుల పేరుమీద నిధులు దండగ తప్ప, ప్రయోజనం శూన్యం.. న్యాయం కూడా అంతే.

Related posts