బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుందని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఈసమయంలో ఆస్పత్రుల వద్ద ధర్నాలు చేయడం చిల్లర రాజకీయమని దుయ్యబట్టారు. మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, ముఠాగోపాల్తో కలిసి విలేకరులతో మంత్రి మాట్లాడారు. కరోనాలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణ కూడ తప్పని సరి అన్నారు. ఈనెల 25న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
హరితహారాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ మొక్కలను ఉచితంగా అందిస్తామన్నారు. హైదరాబాద్ జనాభా కోటిపైనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరు ఈ కేసులతో మరిణిస్తున్నారో మీడియా వివరాలు తెప్పించుకోవాలని సూచించారు. కరోనాకు ఎవరూ అతీతులు కాదన్నారు. కరోనా బారిన పడిన వారు చాలా మంది కోలుకుంటున్నారని మంత్రి తెలిపారు.
ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుంది: ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి