‘ప్రస్థానం’ లాంటి కల్ట్ క్లాసిక్ ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు దేవాకట్టా. ఎమోషన్.. కామెడీ.. రొమాన్స్ ఈ మూడింటిని తనదైన మార్క్ తో తెరపై ఆవిష్కరించడంలో దేవాకి ప్రత్యేకమైన శైలి ఉంది. ప్రస్తుతం జీఎంబీ సంస్థలో ఓ సినిమాతోపాటు సాయిధరమ్తేజ్తో మరో మూవీకి ప్లాన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో సాయి తేజ్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో నటించనున్నాడని సమాచారం. సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఇంకో 10 రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశాలున్నాయి. దేవాకట్టా సినిమాలంటే కథలో తప్పకుండా డెప్త్ ఉంటుంది. తేజ్ సైతం దేవాకట్ట సినిమాను రాసిన తీరును తెగ పొగిడేశారు. అంతేకాదు కథకు తగ్గట్లుగా రమ్యకృష్ణ, జగపతిబాబు లాంటి స్టార్లను తీసుకున్నారట. రమ్యకృష్ణ ఇందులో ముఖ్యమంత్రి పాత్ర చేస్తారని, జగపతిబాబు హీరో తండ్రిగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటే టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సైతం ఈ సినిమాలో నటించనుందట. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో వెల్లడించనున్నారు.
previous post