పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఉప్పెన’కు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలను కూడా బుచ్చిబాబే అందించారు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే.. సంక్రాంతి కానుకగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ విడుదల కాగానే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్లో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ యాంగిల్ బాగా కనిపించింది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
previous post
next post