telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నితిన్ రంగ్ దే వచ్చేది అప్పుడే…

వెంకీ దర్శకత్వంలో నితిన్ హీరోగా చేసిన సినిమా రంగ్‌ దే. ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయట. కానీ ఈ సినిమాను ఎలా విడుదల చేయాలనే దానిపై మూవీ మేకర్స్ అనేక ఆలోచనలు చేశారు. సంక్రాంతికి తలపడేందుకు సిద్ధం చేయాలా? లేదంటే ఓటీటీలో రిలీజ్ చేయాలా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం తలలు బద్దలుకొట్టుకుంటున్నారు. ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారు. సినిమా విడుదలను థియేటర్స్‌లోనే చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్లు కేవలం 100 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. అయితే మొదట ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలి అనుకున్నారు. కానీ అప్పుడు థియేటర్లు యాభైశాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. అప్పుడు సినిమా విడుదల చేస్తే దాదాపు పెట్టిన పెట్టుబడి వసూళ్లు కావాలన్నా చాలా టైం తీసుకుంటుంది. అదే ఇప్పుడు 100శాతం నడుస్తున్నప్పుడు అయితే టాక్ ఎలా ఉన్నా వారం రోజుల్లో అసలు రాబడి వస్తుంది. అందుకే మార్చి 26ను రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఈ సమయంలో వేసవి సెలవులతో పాటు హోలీ తదితర సెలవులు కలిసొస్తాయని ఈ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అందుకే అందరూ తమ సినిమాలను మార్చి తరువాత రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్‌ను కూడా ఏప్రిల్9న విడుదల చేస్తున్నారు.

Related posts