telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చంద్రబాబు ట్వీట్

SPB

కరోనా మహమ్మారి బారిన పడిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలు గత కొన్ని రోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో.. త్వరగా ఆయన కోలుకోవాలని పలువురు ట్విట్టర్ ద్వారా స్పందనలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని కోరారు. ‘కరోనా చికిత్సలో ఉన్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ఆయన త్వరగా కోలుకుని కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని భగవంతుని మనసారా ప్రార్థించుదాం’ అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

Related posts