telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ఘోరం…పుచ్చకాయ తిని ఇద్దరు చిన్నారులు మృతి

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా అంతర్గారం మండలం ఈసంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు కలుషిత ఆహారం తిని మృతి చెందారు. మంగళవారం రోజు ఉరిలోకి అమ్మకానికి వచ్చిన పుచ్చకాయను చిన్నారులు కొన్నారు. చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు, ఓ వృద్ధురాలు సగం పుచ్చకాయ తిన్నారు. మిగతా సగం రాత్రి తినేందుకు కిటికీపై ఉంచారు. అంతకు ముందే ఇంట్లో ఎలుకలు చంపెందుకు ఆహార పదార్ధాలపై ఎలుకలు మందు చల్లారు. అది గమనించక చిన్నారులు, కుటుంబ సభ్యులు మరలా పుచ్చకాయను తినడంతో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. గురు వారం రోజు కరీంనగర్ లోని ప్రవేటు హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతూ ఈరోజు చిన్నారులు శివానంద్(12) శరన్(10) మృతి చెందారు. పిల్లల తల్లిదండ్రులు శ్రీశైలం, గుణవతి, మరో వృద్ధురాలి పరిస్థితి కూడా విషమించడంతో వారిని హైదరాబాద్ తరలించారు. అయితే… ఆహార పదార్దాలు తిన్న ఎలుకలు పుచ్చకాయ ను కూడా తిని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Related posts