telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

షర్మిల కొత్త పార్టీ : ఓయూ జేఏసీ ఫైర్‌

ys sharmila as ycp party working president

లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ నిర్వహించారు. ఉదయం పది గంటలకు అభిమానులతో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన క్లారిటీ కూడా ఇచ్చారు షర్మిల. త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లే ఆమె వ్యాఖ్యలు చెబుతున్నాయి. అయితే… వైఎస్‌ షర్మిల పార్టీ పెడతారనే వార్తలు రాగానే.. తెలంగాణలోని అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ఏపీ పార్టీ తెలంగాణలో అవసరమా.. ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఇక్కడ రుద్దుతారా అని తెలంగాణలోని అన్ని పార్టీలు మండిపడ్డాయి. అయితే.. తాజాగా దీనిపై ఓయూ జేఏసీ కూడా స్పందించింది. కొత్త పార్టీ ఏర్పాటు వార్తలపై వైఎస్‌ షర్మిలకు కౌంటర్ ఇచ్చింది ఓయూ జేఏసీ. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది ఓయూ జేఏసీ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో సమైక్య వాదుల పెత్తనం వద్దని.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలు అవసరం లేదని స్పష్టం చేసింది ఓయూ జేఏసీ. ఆంధ్రలో చేయలేని పెత్తనం తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించింది. అధికార దాహం కోసం తెలంగాణలో పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తే ఓయూ విద్యార్ధి జేఏసీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించింది.

Related posts