telugu navyamedia
రాజకీయ వార్తలు

పూర్తి లాక్ డౌన్ పై యడియూరప్ప క్లారిటీ

Yadyurappa

బెంగళూరులో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో మరోసారి పూర్తి లాక్ డౌన్ ను విధించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో కార్ణాటక సీఎం యడియూరప్ప స్పందించారు. మరోసారి లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. మరో లాక్ డౌన్ వద్దనుకుంటున్న ప్రజలంతా కరోనా నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని హితవు పలికారు. కంటైన్మెంట్ ప్రాంతాల వరకే లాక్ డౌన్ ఉంటుందని తెలిపారు.

కరోనా రక్కసిని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వానికి అందరూ సహకరిస్తున్నారని యడ్డీ చెప్పారు. అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులతో తాము మాట్లాడుతూనే ఉన్నామని అన్నారు. తమతమ నియోజకవర్గాల్లో కరోనాను కట్టడి చేసేందుకు ఎమ్మెల్యేలంతా శాయశక్తులా కృషి చేస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు.

Related posts