దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిలు ధరలు భగ్గుమంటున్నాయి. అటు వంటగ్యాస్, వంట నూనెల రేట్లు ఆకాశానికి తాకాయి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్న మాదిరిగా సామాన్య ప్రజల జీవనం మారింది. అయితే.. తాజాగా రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది కేంద్రం. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ఫామ్ టికెట్ ధరలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్లాట్ఫామ్ టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.30కి పెంచుతున్నట్లు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై లోకల్ ట్రైన్లలో కనీస ఛార్జీని రూ. 30గా నిర్ణయించింది. అసలే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఇది మరో షాక్ అనే చెప్పాలి. అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది. పెరిగిన ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు తాత్కాలికమేనని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్లాట్ఫామ్ టికెట్ ధరల మార్పు నిర్ణయాధికారాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్లకు అప్పగించినట్లు పేర్కొంది.
previous post
పోలీసుల దృష్టిలో ఎవరైనా ఒకటే: మంత్రి బొత్స