telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఎన్నికపై ఏఐసీసీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ సమీక్ష

Manikam Tagore Congress

మేదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికనేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకలో ఎన్నికల ప్రచారాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. దుబ్బాక నియోజకవర్గంలో 146 గ్రామాలున్నాయని, రెండు గ్రామాలకు ఒక ముఖ్య నాయకున్ని ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని ఆయన సూచించారు. ఏడు మండలాలకు ఒక కీలక నేతకు బాధ్యతలు అప్పగించాలని అన్నారు. ఆయా ఎన్నికల్లో నేతలంతా సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని అన్నారు.

Related posts