telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ప్రియుడి కోసం భర్త పై దాడి చేసిన భార్య

ప్రియుడి కోసం భర్త కళ్ళలో కారం చల్లిందో భార్య. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాంబే కాలనీలో నివసిస్తున్న కోసూరు మురళీకృష్ణ భార్యతో గొడవపడి వేరేగా ఉంటున్నాడు. దీంతో ఒంటరిగా ఉన్న భార్య చీమలపాడు గ్రామానికి చెందిన గోకరాజుతో సహజీవనం చేస్తోంది. శనివారం రాత్రి తన భార్యతో గోకరాజు కలిసి ఉండడాన్ని చూసిన మురళీకృష్ణలో ఆవేశానికి గురాయ్యాడు.

వెంటనే తన వద్ద ఉన్న కత్తితో గోకరాజుపై దాడి చేసి గాయపరిచాడు. తేరుకున్న మురళీకృష్ణ భార్య.. భర్త బారి నుంచి ప్రియుడిని రక్షించేందుకు అతడి కళ్లలో కారం చల్లింది. అతడు మంటతో విలవిల్లాడుతుండడంతో ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది. ఆ తర్వాత తేరుకున్న మురళీకృష్ణ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న గోకరాజుకు చెందిన బైకును దహనం చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts