telugu navyamedia
క్రీడలు వార్తలు

39కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్…

చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పట్టు బిగించింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిన్న ఆట ముగిసే సమయానికి 300/6 తో నిలిచింది. కానీ ఆ రోజు ఆట ప్రారంభమైన కాసేపట్టికే ఆ నాలుగు వికెట్లు కోల్పోయి 329 కి ఆల్ ఔట్ అయ్యింది. పంత్(58) చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. ఇక తర్వాత తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు తమ ఓపెనర్ రోరీ బర్న్స్ ను మొదటి ఓవర్లోనే ఔట్ చేసి షాక్ ఇచ్చాడు ఇషాంత్ శర్మ. ఆ తర్వాత సిబ్లీ(16) ను పెవిలియన్ కు చేర్చాడు అశ్విన్. అయితే ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టిన అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (6) ను ఔట్ చేసి తన కెరియర్ లో మొదటి టెస్ట్ వికెట్ సాధించాడు. ఇక మొదటి సెషన్ చివరి ఓవర్ చివరి బంతికి డేనియల్ లారెన్స్(9) ను ఔట్ చేసి అశ్విన్ తన ఖాతాలో మరో రెండో వికెట్ వేసుకున్నాడు. దాంతో 39 పరుగులేకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ప్రస్తుతం క్రీజులో స్టోక్స్(11) ఉన్నాడు.

Related posts