లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి గోవాకు వెళ్లి ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన విశేషాలను విఘ్నేశ్ శివన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు. కాగా ఓ ప్రైవేట్ రిసార్టులో నిరాండబరంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలో నయనతార, విఘ్నేశ్, ఒమనా కురియన్తో పాటు విఘ్నేశ్ తల్లి కూడా ఉన్నారు. ఇక అంతకుముందు తన తల్లి స్విమ్మింగ్ ఫూల్లో దిగి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను పంచుకున్న ఈ దక్షిణాది డైరెక్టర్.. “అమ్మ ముఖంపై వచ్చే చిరునవ్వు మన హృదయంలోని సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది. తల్లిదండ్రులను సంతోషపెట్టడం కంటే మించిన సంతృప్తి, పరిపూర్ణత మరే ఇతర విషయాల్లోనూ మనకు లభించదు. జీవితానికి ఉన్న గొప్ప లక్ష్యం ఏమిటంటే వాళ్లను ఆనందంగా ఉండేలా చేయడమే” అంటూ ఉద్వేగపూరిత పోస్టు షేర్ చేశాడు. ఇక మంగళవారం నయన్ తల్లి ఒమనా కురియన్ పుట్టినరోజు సందర్భంగా దగ్గరుండి కేక్ కట్ చేయించిన ఫొటోను షేర్ చేశాడు. “హ్యాపీ బర్త్డే.. నా ప్రియమైన అమ్మూ మిసెస్ కురియన్” అంటూ ప్రేమను కురిపించాడు. దీంతో నెటిజన్ల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
previous post
next post