సూపర్స్టార్ మహేష్ 25వ చిత్రం “మహర్షి” ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ హీరోగా నటిస్తున్న 26వ చిత్రమిది. ఈ ఏడాది “ఎఫ్-2″తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్లు విజయ శాంతి, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వచ్చిన విషయం విదితమే. మహేష్కు రమ్యకృష్ణ అమ్మ పాత్రలో, విజయశాంతి అత్త పాత్రలో కనిపించబోతున్నారనేది తాజా సమాచారం. పాత్రల పరిధి, ప్రాముఖ్యతలను దృష్టిలో పెట్టుకుని ఈ సీనియర్ హీరోయిన్స్ను ఆ పాత్రలకు ఎంపిక చేసుకున్నారని టాక్. ఈ చిత్రానికి “సరిలేరు నీకెవ్వరూ” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో జగపతిబాబు విలన్గా కనిపించనున్నాడు. జూన్ నుండి ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
previous post
శ్రావణి ఆత్మహత్య : సంచలన విషయాలు బయటపెట్టిన దేవరాజ్