శృతి హాసన్ గత మూడు సంవత్సరాలుగా ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు శృతి. జీ-5లో రిలీజ్ అయిన ‘యారా’ సినిమాతో బాలీవుడ్కు రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదల అయిన తమిళ చిత్రం ‘పుత్తమ్ పుదు కలయ్’లో ఓ చిన్న పాత్రలో కనువిందు చేశారు. ఇక టాలీవుడ్ లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలో శృతి హీరోయిన్గా చేస్తుందన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు పవర్స్టార్ పవన్కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా కీలక పాత్రలో శృతి నటిస్తుందని వార్తలు వచ్చినా వాటిపై మూవీ టీమ్ ఏం స్పందించలేదు. పవన్ కళ్యాణ్తో ఇప్పటికే రెండుసార్లు కలిసి నటించిన శృతి హాసన్ వకీల్ సాబ్ సినిమాతో మూడోసారి జతకట్టబోతుందని తేలిపోయింది. అయితే గబ్బర్సింగ్, కాటమరాయుడు సినిమాలలో లాగా వకీల్సాబ్ సినిమాలో శృతిది ఫుల్ లెన్త్ రోల్ కాదని తెలుస్తోంది. తను ఈ సినిమా షూటింగ్లో పాల్గోనే తేదీ కూడా ఖరారయ్యింది. ప్రస్తుత షెడ్యూల్లో పవన్ కళ్యాణ్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ షెడ్యూల్ ఒక వారంలో ముగియనుంది. డిసెంబర్ మొదటివారంలో మొదలుకానున్న తరువాతి షెడ్యూల్లో శృతి హాసన్ సెట్లోకి అడుగుపెట్టనున్నారు.
next post