telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనియర్ నటి సుమలత కరోనా

Sumalatha

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి సామాన్యులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరిని ఎటాక్ చేస్తుంది. తాజాగా సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత ఒకరు. అయితే ఆవిడకు ఈ నెల ప్రారంభం లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే సుమలత తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించే సమయంలోనే ఆమెకు ఈ వైరస్ సోకింది అని అన్నారు. ఇక తాజాగా ఆవిడకు చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు కర్ణాటక లో 80 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1500 మందికి పైగా ఈ వైరస్ కారణంగా మరణించారు. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ఈ వైరస్ బారిన పడ్డారు.

Related posts