telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తృటిలో తప్పిన ప్రమాదం…

తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా చాలా మంది మరణించారు. అయితే ఇక్కడ మాత్రం ప్రమాదం తృటిలో తప్పిపోయింది. చైత్యన పూరి కమల నగర్ రోడ్డు నెంబర్ 5 లో భారీ వర్షానికి వరద ఒక్కసారిగా పూర్తి స్థాయిలో రావడంతో వరద నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు కుటుంబ సభ్యులలో ఇద్దరు మహిళల్తు నీటి ఉదృతి కి ఒక్క సారిగా నీటి ప్రవాహం లో పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న స్థానిక ఫ్రిజ్ మెకానిక్ నరేష్ సహాయం తో కాలనీ వాసూలు మహిళలు ఇద్దర్ని నీటిలో నుంచి పైకి లేపి కాపాడారు.

అలాగే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం ఉరుములు మెరుపులతో భారీగా వర్షం పడడంతో తో పర్వేద అనుబంధ గ్రామమైన లచ్చిరెడ్డి గూడా గ్రామంలో అక్బర్ అనే గ్రామస్తుడు ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు పై పిడుగు పడి కొబ్బరి చెట్టు పూర్తిగా కాలిపోయింది పిడుగు పడటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు

Related posts