తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లాలోని చిలుకూరు మండలం మిట్స్ కాలేజీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం మిట్స్ కాలేజీ సమీపంలో ఆటో- లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న స్థానికులు గాయపద్దవారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి వాసులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.