telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో మరో టీడీపీ నేతకు కరోనా పాజిటివ్

kidari shravan

ఏపీలో కరోనా వైరస్ అందరినీ టచ్ చేస్తోంది. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. తాజాగా మరో టీడీపీ నేత ఏపీ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కరోనా బారినపడ్డారు.

శ్రవణ్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. కిడారి శ్రవణ్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు. బుద్ధా వెంకన్న కూడా కరోనా బాధితుల జాబితాలో కూడా త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోలు హత్యచేయడంతో టీడీపీ అధినాయకత్వం ఆయన తనయుడు కిడారి శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించింది.

Related posts