telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

tirumala temple

త్వరలో వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. అన్ని రకాల దర్శనాలూ 2 నుంచి మూడు గంటల సమయంలోనే పూర్తవుతున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

సోమవారం నాడు స్వామి వారిని 69,096 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,383 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా సుమారు రూ. 3.09 కోట్లు. ఈ నెలాఖరు వరకూ వారాంతాలు మినహా, తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related posts