నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ను విమర్శించే నైతిక హక్కు గుత్తాకు లేదన్నారు. కేసీఆర్ ఇస్తున్న షాక్స్తో గుత్తాకు మతిభ్రమించిందని ధ్వజమెత్తారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుత్తా రాజకీయ జీవితం ముగిసినట్లేనని పేర్కొన్నారు. తమకు పదవులపై కోరిక ఉంటే మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టంచేశారు.
మదర్ డైరీని అడ్డంపెట్టుకుని గుత్తా సోదరులు అక్రమాస్తులు కూడ బెట్టారని ఆరోపించారు. వైఎస్.రాజశేఖర్రెడ్డితో మాట్లాడి గుత్తాకు ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించామని గుర్తుచేశారు. కానీ ఆయనది పార్టీని చరిత్ర అని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుతో టీఆర్ఎస్ క్యాంపులను ఏర్పాటు చేసిన, ఓటర్లు మాత్రం మాకే ఓటేస్తారని చెప్పుకొచ్చారు. ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు మూడు జడ్పీ ఛైర్మన్లు ను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుదని ధీమా వ్యక్తంచేశారు.