telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 2,361 కేసులు!

Corona

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో అటు ప్రజలను ఆందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజే 2,361 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 70,013కు చేరుకుంది.

తాజాగా 76 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,362కు పెరిగింది. అటు కేసుల్లోనూ, ఇటు మరణాల్లోనూ దేశంలోనే మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఇక, నిన్న ఒక్క రోజే 779 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 37,543 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60 శాతం ఒక్క ముంబైలోనే వెలుగు చూస్తుండడం గమనార్హం.

Related posts