సీఆర్డీఏ అధికారులు కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులపై ఆశ్రమ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ నోటీసులపై ఈనెల 16న హైకోర్టు విచారించింది. నాలుగు వారాలు గడువివ్వాలని సీఆర్డీఏకు హైకోర్టు సూచించింది. నోటీసుల జారీ చేసిన వ్యవహారాన్ని సీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచారు.
అధికారులు కరకట్ట పక్కనే నిర్మించిన ఆరోగ్యాలయ కట్టడంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలను కూల్చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. సీఆర్డీఏ నోటీసులపై నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. నిర్వాహకుల వివరణకు నాలుగు వారాలు గడువివ్వాలని హైకోర్టు ఆదేశించింది. వివరణ తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏకి హైకోర్టు సూచించింది. ఈ నెల 16నే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
బాలయ్య మొనగాడు… చిరంజీవి గిరంజీవి ఎవరూ… : బాబు మోహన్