ఇన్ని రోజులుగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియబోతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేటీఆర్ గోషామహల్ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన అనేక విషయాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇన్వార్టార్లు ఉండేవని, రాష్ట్రం ఏడ్పడిన తరువాత ఇన్వెస్టర్లు వస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతోంది అని చెప్పటానికి ఇదొక నిదర్శనం అని అన్నారు. హైదరాబాద్ లో మంచి వాతావరణం ఉన్నది కాబట్టే ఇక్కడికి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని, ఇక్కడ ఎలాంటి గొడవలు లేవని,కర్ఫ్యూ వాతావరణం లేదని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఆలోచించాలని అన్నారు. హైదరాబాద్ లో అందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నామని, అందరి హైదరాబాద్ ను కొందరి హైదరాబాద్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. నగరంలో ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కరించుకుందామని అన్నారు కేటీఆర్. మరి ప్రాల్కు ఎవరికీ పట్టం కడుతారో చూడాలి.
previous post