telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యడ్యూరప్పకు కరోనా పాజిటివ్

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తనకు కరోనా సోకిందని తెలియజేశారు. కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య దేశ వ్యాప్తంగా అధికమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఆదివారం కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అలాగే తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనాతో ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కూడా కోవిడ్ తో హాస్పిటల్లో చేరారు. ఏపీలో బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఉత్తరప్రదేశ్ లో మంత్రి కమలా రాణి కరోనాతో మృతి చెందారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తనకు కరోనా సోకినట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని యడ్యూరప్ప తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన కోరారు. వరుసగా బీజేపీ అగ్ర నాయకులంతా కరోనా బారిన పడుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Related posts