telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శవాలపై ప్యాలలు ఎరుతున్నారు : కెసిఆర్ ఫ్యామిలీ పై కిషన్ రెడ్డి సంచలనం

kishanreddy on ap capital

కెసిఆర్  రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు చేయడం సరికాదని..కరోనాతో ప్రజలు చనిపోతుంటే రాజకీయాలు చేయడం ఏంటి అని నిలదీశారు.  కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బాధ్యత రహితంగా కామెంట్స్ చేస్తున్నారని.. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూపడం సరికాదన్నారు. కేంద్రం అన్ని రకాలుగా అదుకుంటుందని.. కేంద్ర ప్రభుత్వంకి అందరి ప్రాణాలు సమానమేనని స్పష్టం చేశారు.కరోనా కేసులు, అక్కడ పరిస్థితిని బట్టి ఆక్సీజన్, రేమిడిసివిర్ లను కేటాయిస్తుందని.. వివక్ష చూపెడుతుంది అనడం దురదృష్టకరమన్నారు.కేంద్రం గాంధీ హాస్పిటల్ కి గాలి నుండి ఆక్సీజన్ తయారు చేసే యూనిట్స్ ఇచ్చిందని.. రెండు రోజుల్లో అవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నిమిషానికి వేయి లీటర్ ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని.. వరంగల్, కరీంనగర్ లకు కూడా ఆక్సిజన్ తయారీ యూనిట్స్ పంపిస్తుందని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. 

Related posts