telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రం-పశ్చిమబెంగాల్ ప్రభుత్వాల మధ్య రగడ…

ఈ మధ్యే డిసెంబర్ 9,10 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటనలో ఆయన కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. ఈ సమయంలో ఈ ముగ్గురు అధికారులు నడ్డా బందోబస్తులో పాల్గొన్నారు. నడ్డా పర్యటనకు తగిన భద్రత కల్పించడంలో ఈ ముగ్గురు విఫలమయ్యారని, వారిని వెంటనే కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై పంపాలని కేంద్ర హోంశాఖ కోరింది. తప్పు జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, కేంద్ర సర్వీసులకు పంపేది లేదని మమత  ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల కొరత ఉందని, ఈ పరిస్థితుల్లో వారిని డిప్యూటేషన్ మీద దిల్లీకి పంపడం సాధ్యం కాదని బెంగాల్‌ ప్రభుత్వం కేంద్రానికి తేల్చి చెప్పింది ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని బెంగాల్ ప్రభుత్వం లేఖ రాయటంతో వివాదం ముదిరిపోయింది. కానీ కేంద్రం మాత్రం డైమండ్ హార్బర్ ఎస్పీ భోలనాథ్ పాండే, డిఐజీ ప్రవీణ్ త్రిపాఠీ, ఏడీజీ రాజీవ్ మిశ్రాలను వెంటనే కేంద్ర సర్వీసులకు పంపాల్సిందేనని ఆదేశించటంతో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లనుంది. అధికారులను డిప్యూటేషన్ మీద పంపాలని అడిగే అధికారం కేంద్రానికి ఉంది. అయితే వారిని పంపాలా వద్దా అని నిర్ణయించే అధికారం రాష్ట్రానికి ఉందని తృణమూల్ అంటోంది. కేంద్రం ప్రతీకార ధోరణిలో ఉందని  తృణమూల్ మండిపడుతోంది. కేంద్రం తీరు సమాఖ్య ప్రాథమిక సూత్రాలకు, రాజ్యాంగానికి విరుద్ధమని మమతా బెనర్జీ మండిపడుతున్నారు.

Related posts