కరోనా వైరస్ మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటిలోనే ప్రజలను ఉంచడాన్ని ప్రోత్సహించడంలో భాగంగా సిమ్లను ఇంటి వద్దకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వినూత్న సేవలను హైదరాబాద్లో ఆ సంస్థ ఆరంభించింది.
నగరంలో అత్యధిక రిటైల్ అవుట్లెట్లు తెరుచుకున్నప్పటికీ, కాంటాక్ట్లెస్ డెలివరీ సేవల్లో భాగంగా వినియోగదారుడికి సిమ్ కార్డును ఇంటి వద్దకే అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. బ్రాడ్బ్యాండ్ డీటీహెచ్, తదితర సేవలను కూడా ఇంటి నుంచే పొందవచ్చని కంపెనీ పేర్కొంది.
జగన్ అప్పుడే సీఎం అయ్యేవారు: నటి హేమ