వైసీపీ అధినేత జగన్ పై టాలీవుడ్ నటి హేమ ప్రశంసలు కురిపించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ రుణమాఫి చేస్తానని చెప్పి ఉంటే జగన్ 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు. అదే సమయంలో రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇంకా ఆ హామీని పూర్తిగా అమలుచేయలేకపోయారని అన్నారు. జగన్ ముక్కుసూటి మనిషి అని హేమ తెలిపారు. ‘అమలు చేయలేని హామీలను నేను చెప్పను, అబద్ధం చెప్పలేను’ అని అప్పుడు జగన్ అన్నారని గుర్తుచేశారు.
జగన్ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయకూడదని భావిస్తున్నారనీ, జగన్ లోని ఆ లక్షణం తనకు బాగా నచ్చిందని హేమ వ్యాఖ్యానించారు. కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా చంద్రబాబు హామీని నిలబెట్టుకోలేదని హేమ విమర్శించారు. కానీ జగన్ మాత్రం ‘ఈ రిజర్వేషన్ చేయడం వీలుకాక పోవచ్చు అని తెలిపారు. ఇది కాపులకు నచ్చకపోయినా జగన్ డొంకతిరుగుడు మాటలు మాట్లాడలేదని హేమ గుర్తు చేశారు.
చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి : ఉమ్మారెడ్డి