పార్టీ మారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలో జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… టీడీపీపై ప్రజల్లో విశ్వాసం పోతోందని చంద్రబాబు కనీసం ప్రతిపక్ష నేత పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారని గన్నవరం నేత వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై జేసీ స్పందించారు.
‘పార్టీ మారే వారు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా? అందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు’ అని అన్నారు. కొన్ని నెలల క్రితం చంద్రబాబుపై సుజనా చౌదరి కూడా విమర్శలు చేశారని, వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంలో ప్రతీకార కోరిక ఎక్కువైందని అన్నారు. ప్రత్యర్థులను హింసిస్తున్నారని, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని వారు తెలుసుకోవాలని జేసీ పేర్కొన్నారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ నాశనం చేసింది: యనమల