telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉత్తమ్ ఢిల్లీ పర్యటన.. ఎందుకు..?

త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్‌. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు… ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కమిటీలపై కూడా చర్చ జరిగింది అయితే ఈ సమయంలో చాలా రోజుల తర్వాత ఇవాళ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్తుండడం హాట్‌ టాపిక్‌గా మారింది.. వీటికి సంబంధించి ఎన్నికలు, మేనిఫెస్టో కమిటీల్ని వేయాలని నిర్ణయించారు. ముఖ్య నాయకులు… డీసీసీ అధ్యక్షులతో సమావేశమై చర్చించారు ఉత్తమ్‌. ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే… రంగారెడ్డి.. హైదరాబాద్.. పాలమూరు నియోజకవర్గం నుండి … మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి , వంశీ పేర్లతో పాటు… ఉపాధ్యాయ సంఘం నుండి హర్ష వర్ధన్ పేరు కూడా హైకమాండ్‌కు పంపుతున్నారు.  ఇక..వరంగల్..ఖమ్మం.. నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి… మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బెల్లయా నాయక్ పేర్లు చర్చకు వచ్చాయి. అటు మానవతా రాయ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ఇవాళ ఉత్తమ్‌ ఢిల్లీ వెళ్తుండడంతో హైకమాండ్‌తో ఏం చర్చిస్తారన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

Related posts