telugu navyamedia
రాజకీయ వార్తలు

వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: వెంకయ్య

Vice President of India Venkaiah Terrarism

వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని బేగంపేటలోని అణుశక్తి విభాగం 70వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సవాళ్లను అధిగమించేలా మరిన్ని పరిశోధనలు జరగాలని అన్నారు.

అనంతరం శాస్త్రవేత్తలతో సమావేశమైన వెంకయ్య వారి కృషిని అభినందించారు. ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. . గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం, మినరల్స్ గురించి అవగాహన కార్యక్రమాలను అణు విభాగం నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా వివిధ కొత్త పరిశోధనలు చేయాలని కోరారు.

Related posts