telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబు దోపిడీని చూడలేకే టీడీపీని వీడా: ఎమ్మెల్యే మేడా

MLA Meda Mallikarjun
ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న దోపిడీని చూడలేకే టీడీపీని వీడానని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు. లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను వైఎస్ జగన్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు తనకు గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చినట్టుందని అన్నారు. కాపు రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి తదితర హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. రూ. 800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. చంద్రబాబును ఓడించి, జగన్ ను సీఎం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రేపు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని తెలిపారు. ఈనెల 31న వైఎస్ జగన్ సమక్షంలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.

Related posts