telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా తీవ్రమవుతోంది..నిర్లక్ష్యం వద్దు: డబ్ల్యూహెచ్ఓ

who modi

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో పలు దేశాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో గరిష్ఠానికి చేరిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టీడ్రాస్ అడ్హనామ్ తెలిపారు. జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో జరుగుతున్న మూకుమ్మడి పౌర నిరసనల కారణంగా వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోందని ఆయన అన్నారు.

చైనాలో గత డిసెంబర్ లో వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత 70 లక్షల మంది వ్యాధి బారిన పడగా, ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. తూర్పు ఆసియా తరువాత, యూరప్ లో ఈ మహమ్మారి హాట్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి. దాన్ని అమెరికా ఇప్పుడు అధిగమించిందన్నారు.

యూరప్ లో పరిస్థితి మెరుగు పడుతోందని, ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే మాత్రం వైరస్ తీవ్రమవుతోందన్నారు. గత 9 రోజుల్లో రోజుకు లక్ష కేసులకు పైగా రాగా, నిన్న ఏకంగా 1.36 లక్షల కొత్త కేసులు వచ్చాయని వెల్లడించారు. ఒక రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికమని ఆయన అన్నారు. ఈ కొత్త కేసుల్లో 75 శాతానికి పైగా కేసులు అమెరికన్, సౌత్ ఆసియా దేశాలకు చెందినవే కావడం గమనార్హం.

Related posts