telugu navyamedia
రాజకీయ వార్తలు

“పౌరసత్వ” నిరసనలో జర్మన్ విద్యార్థి .. ఇండియా నుంచి పంపించిన అధికారులు!

student iit chennai

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన నిరసనల్లో జర్మనీకి చెందిన విద్యార్థి పాల్గొన్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. మద్రాస్ ఐఐటీలో భౌతికశాస్త్రంలో పీజీ చేస్తున్న జాకబ్ లిండెంతల్ అనే విద్యార్థి, గత వారంలో నిరసనల్లో పాల్గొన్నారు.

జాకబ్ చర్యలు వీసా నిబంధనలను ఉల్లంఘించినట్టేనని, తనంతట తానుగా ఇండియాను వదిలి వెళ్లకుంటే, దేశ బహిష్కరణ చేయాల్సి వస్తుందని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు హెచ్చరించారు. ఇండియాను విడిచి వెళ్లేందుకు సోమవారం వరకూ సమయం ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక జాకబ్ సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి ఆమ్ స్టర్ డామ్ కు వెళ్లిపోయాడు.

బహిష్కరణపై స్పందించిన జాకబ్, సీఏఏపై తాను ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేదని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చాడు. తన మిత్రులతో కలిసి చెపాక్‌, వల్లవర్‌ కొట్టమ్ ప్రాంతాలకు వెళ్లానని, ఇండియా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని అన్నాడు. తనకు పడ్డ శిక్షపై న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకెళ్తానని చెప్పాడు.

Related posts