telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

లాక్‌డౌన్‌ మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు: రాహుల్

Rahul gandhi congress

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను భారీగా పెంచాలని అన్నారు.

కరోన్న మహమ్మారి చాలా పెద్ద సవాలేనని రాహుల్ వ్యాఖ్యానించారు. మన దేశంలో సంక్షోభ సమయంలో సమస్యల పరిష్కారానికి కొత్త ఆవిష్కరణలు, మార్గాల కోసం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డేటా విశ్లేషకుల సంఖ్యను భారీగా పెంచాలని ఆయన ట్వీట్ చేశారు. దేశంలో వినూత్న ఆవిష్కరణల అవసరాన్ని ఇటువంటి విపత్కర పరిస్థితులు గుర్తు చేస్తాయన్నారు. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహాన్నివ్వాలని సూచించారు.

Related posts