బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పంట పొలాలు నీటమునిగాయి.
పత్తి, కంది, మొక్క జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. చెరవులకు గండ్ల భయంతో చాలా ప్రాంతాల్లో స్థానికులు మత్తళ్లను తవ్వేశారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. భారీ వర్షాల కారణంగా . రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి