telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆ ప్రామిస్‌ను నెరవేర్చకుండానే వెళ్లిపోయావా?: ట్విట్టర్ లో స్మృతీ ఇరానీ

smruthi irani

బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ట్విట్టర్ లో ఆమె స్పందిస్తూ .. సుష్మను ప్రేమగా అక్కా అని పిలిచే స్మృతి, ట్విట్టర్ వేదికగా సుష్మాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “‘నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది అక్కా బన్సూరీతో కలిసి నన్ను రెస్టారెంట్ కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చకుండానే నువ్వు వెళ్లిపోయావు” అని ఆమె ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో ఇద్దరూ కేంద్ర మంత్రులుగా కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.

Related posts