telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ: గవర్నర్‌

governor tamilisai

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ ఏర్పడిందని అన్నారు. గత ఆరేళ్లలో రాష్ట్రం వినూత్న అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ స్పష్టంచేశారు.

బంగారు తెలంగాణ లక్ష్యాన్ని త్వరలోనే అందుకోగల మని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్‌– 19తో ఏర్పడిన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవటానికి తెలంగాణ ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నార ని కొనియాడారు. తెలంగాణ సంపన్నరాష్ట్రమని నిరూపిస్తూ విజయవంతంగా బయటకు వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts