కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్స్పష్టం చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్మికుల సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా పారిశ్రామిక విధానాలు ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని గుర్తు చేశాడు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించారన్నారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను రద్దు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. పరిశ్రమలకు సమీపంలోనే నివాస స్థలాలు ఉండాలని కార్మికులు కోరుతున్నారని, కార్మికులకు రాయితీపై ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.
లోకేశ్ సరిగా మాట్లాడలేరు అందుకే ట్వీట్లు : అనిల్ కుమార్ యాదవ్