telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అవంతి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

వైసీపీ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ పై ఎంత కోపం ఉందో సభలో బయట పడిందని అసెంబ్లీలోఅచ్చెన్నాయుడు అన్నారు. జగన్ ను ఉద్దేశించి తాము ‘ఉన్మాది’ అన్నామో, లేదో తెలియదు కానీ… వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం పదేపదే ‘ఉన్మాది’ అనే పదాన్ని ఉచ్చరిస్తూ జగన్ పై ఉన్న కోపాన్నంతా తీర్చుకున్నారని చెప్పారు.ఇదే సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ అంశం చర్చకు వచ్చింది.

టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్లీ వెనక్కి వచ్చేస్తానని చెప్పే ఆయన వైసీపీలో చేరారని… ఇప్పుడు మాత్రం సభలో అవంతి నీతులు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై కన్నబాబు స్పందిస్తూ, టీడీపీలోకి ఎప్పుడు, ఎవరు వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయన్న విషయం అవంతికి అర్థమైనట్టుందని నవ్వుతూ చెప్పారు.పేరు చివర నాయుడు ఉన్నవారికే టీడీపీలో ప్రాధాన్యత ఉంటుందని దానికి అచ్చెన్నాయుడు, రామానాయుడే ఉదాహరణ అని కన్నబాబు చమత్కరించారు.

Related posts