telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: చంద్రబాబు

chandrababu

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైసీపీ తప్పుడు కేసుల వేధింపులు తట్టుకోలేక నలంద కిశోర్ కలత చెందారని చంద్రబాబు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడనే వంకతో అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.వృద్ధుడని కూడా చూడకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని విమర్శించారు. ఆయన వయసును కూడా పట్టించుకోకుండా విశాఖ నుంచి కర్నూలు తీసుకుపోయారని ఆరోపించారు. నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related posts