telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

షాక్ : కారు కోసం మూడు నెలల కొడుకునే అమ్మేసిన త‌ల్లిదండ్రులు

New Born baby

సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కేందుకు ఓ జంట ఏకంగా 3 నెలల తమ పసిబిడ్డను అమ్మేసింది. శిశువు అమ్మమ్మ,తాతయ్య దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. అసలు ఏం జరిగిందంటే ఉత్తర్ ప్రదేశ్, కన్నౌజ్ పట్టణంలోని తిర్వా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దంపతులు నివసిస్తున్నారు. మూడు నెలల క్రితం వీరికి మగ బిడ్డ జన్మించాడు. ఇటీవల గుర్సాహైగంజ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఆ దంపతులు తమ పసిబిడ్డను అమ్మేశారు. రూ1.5లక్షలకు బేరం కుదుర్చుకుని కన్న కొడుకుని విక్రయించారు. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారు. కేవలం కారు కొనుక్కోవాలన్న ఉద్దేశంతోనే ఆ దంపతులు తమ కన్న కొడుకును అమ్మేసినట్లు శిశువు అమ్మమ్మ,తాతయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ పసిబిడ్డ సదరు వ్యాపారవేత్త వద్దే ఉన్నాడని… అతన్ని,అతని భార్యను విచారణకు రావాల్సిందిగా కోరామని చెప్పారు. ఆ వ్యాపారవేత్త నుంచి తీసుకున్న డబ్బుతో ఆ దంపతులు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్న మాట వాస్తవమేనని చెప్పారు.

Related posts