ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు వరుసగా హీరోయిన్ లు నో చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతకముందు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారు మేకర్స్. కొంచెం రెబల్ క్యాండిడేట్లా కనిపించే మిసెస్ అయ్యప్పనుమ్ క్యారెక్టర్కి హైబ్రిడ్ పిల్ల అయితే బావుంటుంది ఊహించుకున్నారు. అయితే సాయి పల్లవి వారికీ షాక్ ఇచ్చింది. పావన తో స్టెప్పులెయ్యడానికి నో నో చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా రానా ధీ కూడా అదేహ్ పరిస్థితి అని తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ మేకర్స్ రానా కు జంటగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ను సంప్రదించారంట. కానీ ఐశ్వర్య రాజేష్ కూడా సినిమాకు నో చెప్పారని టాక్ నడుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనుంది. అయితే వరుసగా హీరోయిన్ లు నో చెప్పడంతో ప్రస్తుతం మూవీ మేకర్స్ మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.
previous post