వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను వర్మ విడుదల చేశారు. ఇంకా చాలా సినిమాలు వర్మ దగ్గర ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. అదే ‘థ్రిల్లర్’. అప్సర రాణి, రాక్ కచ్చి జంటగా నటించిన ఈ రొమాంటిక్ మూవీకి ఇప్పటికే కావాల్సినంత ప్రచారం చేసేశారు వర్మ. హీరోహీరోయిన్లతో నగ్నంగా ఫొటోషూట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ను రేపు (జులై 30న) ఉదయం 11 గంటలకు వర్మ విడుదల చేస్తున్నారు. మొత్తం 9 భాషల్లో ఈ ట్రైలర్ విడుదలవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, భోజ్పురి, గుజరాతి, ఒడియా భాషల్లో విడుదల చేస్తున్నారు. త్వరలోనే సినిమాను కూడా విడుదల చేయనున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ఈటీ ప్లాట్ఫాంలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
THRILLER trailer releasing tmrw mrng 11 AM ..Film Releasing soon in https://t.co/YpBOXfI9v7 and https://t.co/qpzR6pSo0l @apsara_rani_ @Rock_kacchi pic.twitter.com/VKPmx1SlS5
— Ram Gopal Varma (@RGVzoomin) July 29, 2020