దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ స్వీయదర్శకత్వంలో నటించిన “కాంచన-3” కలెక్షన్లతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే తెలుగు, తమిళంలో కలిపి రూ.130 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. “ముని” చిత్రానికి నాలుగో సీక్వెల్గా కామెడీ, హర్రర్ కంటెంట్తో వచ్చిన “కాంచన-3″కి తొలిరోజే హిట్ టాక్ రావడం, వేసవి సెలవులు కలిసి వస్తుండడంతో విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ఫుల్గా నడుస్తోంది. మరో రెండు వారాల్లో రూ.200 మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్స్టార్ రజినీకాంత్ “కాంచన-3” చిత్రబృందాన్ని అభినందించారట. ఈ విషయాన్ని లారెన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. “కాంచన-3` విజయవంతమైన తర్వాత మా గురువు, తలైవా రజినీకాంత్ను కలిశాం. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాం” అని లారెన్స్ ట్వీట్ చేశారు. రజినీని లారెన్స్తోపాటు హీరోయిన్ వేదిక కూడా కలిసింది. రజినీ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న “దర్బార్” సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారు. అక్కడకు లారెన్స్, వేదిక వెళ్లి కలిశారు.
previous post