రెండు అరటిపండ్లు తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చిన బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్కి ఓ ఫైవ్ స్టార్ హోటల్ రూ.442.50 బిల్లు వేసిన ఘటన మరవక ముందే మరో సెలెబ్రిటీకి అలాంటి అనుభవమే ఎదురైంది. గతంలో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ షూటింగ్ కోసం చండీగఢ్ వెళ్లి జేడబ్ల్యూ మారియట్ హోటల్లో దిగారు. జిమ్ చేసిన రాహుల్ భోజనం తర్వాత రెండు అరటి పండ్లకు ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన రెండు అరటి పండ్లకు సదరు ఫైవ్ స్టార్ హోటల్ వారు రూ.442.50 బిల్ వేశారు.దీనిపై రాహుల్ బోస్ ట్వీట్ చేయగా ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ డిపార్టుమెంటు వారు రంగంలోకి దిగి రెండు అరటిపండ్లకు అధికంగా బిల్లు వేసిన ఆ ఫైవ్ స్టార్ హోటల్ కు రూ.25వేల జరిమానా విధించారు. కేవలం మూడు కోడిగుడ్లకు 1672 రూపాయల బిల్లు వేసిన 5 స్టార్ హోటల్ బాగోతం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావూజీని అహ్మదాబాద్ నగరంలోని హోటల్ హయత్ రెజెన్సీ 5స్టార్ హోటల్లో బస చేశారు. శేఖర్ రావూజీ గురువారం మూడు ఎగ్ వైట్లతో భోజనం ఆర్డర్ ఇచ్చారు. అంతే సదరు హయత్ రెజెన్సీ హోటల్ సప్లయర్ మూడు బాయల్డ్ ఎగ్స్ ను ఇచ్చి శేఖర్ చేతిలో 1672 రూపాయల బిల్లు పెట్టాడు. అంతే ఆ బిల్లు చూసిన శేఖర్ రావూజీ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.దీంతో నోటి నుంచి మాట కూడా రాక, ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ట్విట్టర్లో షేర్ చేశారు. మూడు ఉడికించిన కోడిగుడ్లకు 1350 రూపాయలు, దానికి సర్వీస్ చార్జీగా 67.50 రూపాయలు, దీనిపై సీజీఎస్టీ 9 శాతం కింద 127.58 పైసలు, ఎస్ జీఎస్టీ 9 శాతం కింద మరో రూ.127.58 కలిపి మొత్తం 1672రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. దీంతో షాక్ కు గురైన సంగీత దర్శకుడు శేఖర్ రావూజీ హోటల్ బిల్లుతో సహా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Baap re Baap , looks like eggs came from ISD hen , who traveled all the way to this hotel to deliver those 3 eggs.
Hadd hai !! its not Andey ka Funda, its Ande ka फंदा !! https://t.co/gVGAErW2p7
— RJ ALOK (@OYERJALOK) 14 November 2019